ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయం: శివసేన ఎంపీ సంజయ్ రౌత్
- అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ మరింత ప్రమాదకరంగా మారారన్న శివసేన ఎంపీ
- కేజ్రీవాల్ జైలు నుంచి పనిచేయడం మొదలు పెట్టారని వెల్లడి
- కేజ్రీవాల్కు మద్దతుగా ఇండియా కూటమి నిర్వహించే ర్యాలీలో పాల్గొంటానని వెల్లడి
రౌత్ ఇంకా మాట్లాడుతూ.. "అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడే జైలు నుంచి పనిచేయడం మొదలు పెట్టారు. ప్రజలు కూడా ఆయన మాట వినడంతో పాటు మద్దతుగా నిలుస్తారు. స్వాతంత్ర్య పోరాటంలో కూడా జైలుకు వెళ్లిన నాయకులు మరింత బలంగా బయటకు వచ్చారు" అని చెప్పుకొచ్చారు.
ఇదిలాఉంటే.. రాజకీయ నాయకులను భయపెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు ప్రధాని దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారని ఇప్పటికే పలువురు విమర్శించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మార్చి 31న అన్ని భారత మిత్రపక్షాల నేతలు ఏకతాటిపైకి వచ్చి ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.