ఇన్ స్టాగ్రామ్ లో రష్మికకు 40 మిలియన్ల ఫాలోవర్లు
- 'ఛలో' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక మందన్న
- వరుస హిట్లతో స్టార్ డమ్
- 'పుష్ప' చిత్రంతో విపరీతమైన క్రేజ్
గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలతో రష్మిక స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. 'వారిసు' చిత్రంతో తమిళంలోనూ హిట్ కొట్టిన ఈ స్లిమ్ బ్యూటీ తాజాగా 'యానిమల్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించింది. తాజాగా ఆమె 'పుష్ప' సెకండ్ పార్ట్ లోనూ నటిస్తోంది. అంతేకాదు, రష్మిక ప్రధాన పాత్రలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ 'రెయిన్ బో' చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.