ప్రజల కోసం కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్ గఢ్ సీఎం... వీడియో ఇదిగో!
- దీపావళి వేళ ఛత్తీస్ గఢ్ లో గౌరా గౌరీ పూజ
- అమ్మవారి పూజలో భాగంగా కొరడా దెబ్బలు
- ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్నానన్న సీఎం బఘేల్
దుర్గ్ జిల్లాలోని జంజ్గీర్ గ్రామంలో జరిగిన గౌరా గౌరీ పూజకు హాజరైన సీఎం బఘేల్ ఎంతో భక్తిప్రపత్తులతో అమ్మవారిని పూజించారు. సంప్రదాయాన్ని అనుసరించి చేతిపై కొరడా దెబ్బలు తిన్నారు. రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కొరడా దెబ్బలు తిన్నానని వెల్లడించారు.
ఈ పండుగ అందరూ సమానమేనని చాటుతుందని, అమ్మవారి ముందు అందరూ ఒక్కటేనని అన్నారు. ఇది సర్వ మానవ సమానత్వాన్ని సూచించే పండుగ అని సీఎం బఘేల్ వివరించారు.