పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్ పదవికి ఇంజమామ్ ఉల్ హక్ గుడ్బై
- ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపిక సరిగా జరగలేదనే ఆరోపణలే కారణం
- పీసీబీ పారదర్శక దర్యాప్తు కోసమే వైదొలగుతున్నట్టు రాజీనామా లేఖలో వెల్లడి
- వరల్డ్ కప్లో పాక్ వరుస ఓటముల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామం
జట్టు ఎంపికపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సిద్ధమైంది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మీడియాలో వచ్చిన ఆరోపణలపై పీసీబీ పారదర్శకంగా విచారణ చేపట్టేందుకు వీలుగా పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ఇంజమామ్ కారణాన్ని చూపాడు. ఒకవేళ కమిటీ తనను నిర్దోషిగా తేల్చితే తిరిగి చీఫ్ సెలెక్టర్గా కొనసాగుతానని రాజీనామా లేఖలో స్పష్టం చేశాడు. ఈ మేరకు పీసీబీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా.. ఇంజమామ్ రాజీనామా పీసీబీకి ఆర్ఠిక భారంగా మారే అవకాశం ఉందని పాకిస్థాన్ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఒప్పందం రద్దు కారణంగా ఇంజమామ్కు సుమారుగా 15 మిలియన్ల పాక్ రూపాయల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నాయి.