New Delhi: ఢిల్లీలో సినిమాను తలపించిన రాబరీ సీన్.. వీడియో ఇదిగో!

Armed Men Rob Two Inside Pragati Maidan Tunnel in Delhi
షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. సినిమాను తలపించేలా సాగిన ఈ రాబరీ అంతా క్షణాల్లో పూర్తయింది. బైక్ లపై వచ్చిన దొంగలు కారును ఆపి, గన్స్ తో బెదిరించి క్యాష్ బ్యాగును ఎత్తుకెళ్లారు. ప్రగతి మైదాన్ టన్నెల్ లో జరిగిన ఈ చోరీ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా చేసి, ప్రజలకు రక్షణ కల్పించే సామర్థ్యం ఉన్న మరొకరిని ఎల్జీగా నియమించేందుకు తోడ్పడాలని అన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడం కేంద్రానికి చేతకాకపోతే ఆ బాధ్యతను ఢిల్లీ సర్కారుకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

రెడ్ ఫోర్ట్ ఏరియాకు చెందిన ఓ డెలివరీ ఏజెంట్, అతని సహాయకుడు ఇద్దరూ కలిసి ఓ బ్యాగును గురుగ్రామ్ లో అందజేసేందుకు బయలుదేరారు. బ్యాగ్ లో క్యాష్ ఉండడంతో సేఫ్టీ కోసమని ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు ప్రగతి మైదాన్ టన్నెల్ గుండా వెళుతుండగా రెండు బైక్ ల మీద వచ్చిన నలుగురు యువకులు కారును ఆపేశారు. తమ బైక్ ను అడ్డంపెట్టి కారును ఆపారు, ఆపై గన్స్ తో బెదిరించి నగదు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. ఇదంతా క్షణాలలో జరిగిపోయింది. టన్నెల్ లో అమర్చిన సెక్యూరిటీ కెమెరాల్లో ఈ సీన్ మొత్తం రికార్డయింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. సదరు డెలివరీ సంస్థ ఉద్యోగుల గురంచి ఆరా తీస్తున్నారు. సంస్థలోని వ్యక్తులు లేదా వారి సహకారంతో వేరేవాళ్లు ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, ఈ అనుమానాన్ని బలపరిచే ఆధారాలు ఏవీ ఇప్పటి వరకు దొరకలేదని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు.
Go Back to Shorts
New Delhi
robbery
Pragati Maidan Tunnel
car
bikes

More Telugu News