Maharashtra: 35 ఏళ్ల తర్వాత ఆడపిల్ల.. ఏనుగుపై ఊరేగింపు.. వీడియో ఇదిగో!

  • మహారాష్ట్రలోని పచ్‌గావ్‌లో ఘటన
  • ఐదు నెలల తర్వాత ఇంటికి తీసుకొచ్చిన పాపకు ఘన స్వాగతం
  • వేడుక చూసేందుకు కదిలివచ్చిన గ్రామస్థులు
Man celebrate birth of girl child by taking out procession on elephant

పుట్టబోయేది అమ్మాయని తెలిసి గర్భంలోనే చిదిమేస్తున్న వేళ ఓ కుటుంబం లేక లేక కలిగిన ఆడపిల్లను ఏనుగుపై ఊరేగించింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్‌గావ్‌లో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన గిరీశ్ పాటిల్‌కు ఐదు నెలల క్రితం పాప పుట్టింది. ఆ వంశంలో అమ్మాయి పుట్టడం 35 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో ఆ ఇంట ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది.

పాపకు ‘ఐరా’ అని పేరు పెట్టారు.  చిన్నారిని నిన్న ఇంటికి తీసుకురాగా దానిని ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతిగా మార్చుకున్నారు. ఐరాను ఏనుగుపై ఊరేగిస్తూ డబ్బు వాయిద్యాల మధ్య గిరీశ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ వేడుకను తిలకించేందుకు ఊరు ఊరంతా కదిలి వచ్చింది.

More Telugu News