Salman Khan: రేపు 'జీ 5' ఫ్లాట్ ఫామ్ పైకి 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'

  • ఇటీవల సల్మాన్ నుంచి వచ్చిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'
  • థియేటర్లలో తొలిరోజునే నిరాశపరిచిన ఫలితం 
  • పూజ హెగ్డే అభిమానులకు అసంతృప్తిని మిగిల్చిన చిత్రం  
  • రేపటి నుంచి జీ 5లో స్ట్రీమింగ్
Kisi Ka Bhai Kisi Ki Jaan in Zee 5

సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా రూపొందింది. సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 21వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్స్ తో కూడిన కథ కావడం వలన, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచుకుంటూ వచ్చారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


ఈ సినిమాలో సల్మాన్ సరసన నాయికగా పూజ హెగ్డే నటించింది. ఇక కీలకమైన పాత్రలలో వెంకటేశ్ - జగపతిబాబు నటించారు. తెలుగు నుంచి స్టార్స్ ఉండటంతో, తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచుకుంటూ వెళ్లారు. అయితే విడుదల రోజునే ఈ సినిమాపట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాము ఆశించినట్టుగా లేదంటూ పెదవి విరిచారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రానుంది. 

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ 5వారు దక్కించుకున్నారు. రేపు (మే 26) వతేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. హీరోగా .. నిర్మాతగా ఈ సినిమా సల్మాన్ కి నిరాశను మిగిల్చింది. వరుస ఫ్లాపులతో ఉన్న పూజ హెగ్డేకి ఈ సినిమా హెల్ప్ కాలేకపోయింది. ఇక ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.

More Telugu News