'కాంతార' దర్శకుడితో విజయ్ దేవరకొండ?
- 'ఖుషీ' సినిమాతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ
- ఆ తరువాత సినిమా గౌతమ్ తిన్ననూరితో
- లైన్లో ఉన్న పరశురామ్ - సుకుమార్
- ఈ లోగానే తన ప్రాజెక్టును చక్కబెట్టే పనిలో రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టికి దర్శకుడిగా మంచి అనుభవం ఉంది. ఆయన దర్శకత్వంలో తెలుగులో ఒక సినిమా చేయాలనుందని ఆ మధ్య అల్లు అరవింద్ అన్నారు. త్వరలోనే ఆ మాటను నిజం చేయాలనే ఆలోచనలో రిషబ్ శెట్టి ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా చేయాలనే దిశగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడని అంటున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ .. శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషీ' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత గౌతమ్ తిన్ననూరి .. పరశురామ్ లతో కలిసి పనిచేయనున్నాడు. ఆయనతో కలిసి ఒక సినిమా చేయాలనుందని సుకుమార్ కూడా అన్నాడు. మరి ఈ గ్యాపులో రిషబ్ శెట్టి ఏ వైపు నుంచి ఎంట్రీ ఇస్తాడనేది చూడాలి. త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చని అంటున్నారు.