Nara Lokesh: అదీ... యువగళం దెబ్బంటే!: నారా లోకేశ్

  • చంద్రగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర
  • తొండవాడలో లోకేశ్ సభ
  • వెంకటేశ్వరస్వామి పాదాల చెంత నిలబడి మాట్లాడుతున్నానని వెల్లడి
  • జగన్ ది గవర్నమెంట్ ఆర్డర్... తనది పబ్లిక్ ఆర్డర్ అని వ్యాఖ్యలు
Lokesh meeting in Thondavada

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. నేడు లోకేశ్ తొండవాడలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.    నేడు వెంకటేశ్వరస్వామి పాదాల చెంత నిలబడి మీతో మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని వెల్లడించారు. విజయనగరం సామ్రాజ్యంలో  ఒక వెలుగు వెలిగిన గడ్డ ఈ చంద్రగిరి గడ్డ అని పేర్కొన్నారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో నేడు ల్యాండ్, శాండ్, వైన్, మైన్, ఎర్రచందనం మాఫియా పేట్రేగిపోతోందని మండిపడ్డారు.

లోకేశ్ ప్రసంగం హైలైట్స్...

•    తాడేపల్లి ప్యాలెస్ లో పిల్లి 4 సంవత్సరాలు ఇంట్లో పడుకుని... యువగళం దెబ్బకు భయపడి పల్లెనిద్రకు వెళతానని అంటున్నాడు. అదీ.. యువగళం దెబ్బంటే!
•    నేను యువగళం ప్రారంభించే ముందే తాడేపల్లి పిల్లి జీఓ-01ను తెచ్చాడు. దాన్ని అడ్డంపెట్టుకుని నన్ను రోడ్డపై నిలబడనివ్వడం లేదు. మైక్ పట్టుకోనివ్వడం లేదు.
•    సౌండ్ వాహనాలు లాక్కుంటున్నారు. నేను నిలబడే స్టూల్ లాక్కుంటున్నారు.
•     జగన్ ది గవర్నమెంట్ ఆర్డర్... ఈ లోకేష్ ది పబ్లిక్ ఆర్డర్. 
•    జగన్ గవర్నమెంట్ ఆర్డర్ తో నన్ను ఆపాలని చూస్తున్నారు... కానీ పబ్లిక్ ఆర్డర్ ను మాత్రమే నేను గౌరవించి మీ వద్దకు వస్తున్నాను.
•    గవర్నమెంట్ ఆర్డర్ తో నా దగ్గర వందలాది పోలీసులు, వజ్ర వాహనం, ఇంటెలిజెన్స్ వాళ్లను తిప్పుతున్నారు.

•    2019ఎన్నికల సమయంలో మీరు యువతకు ఇచ్చిన హామీలు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతియేటా 6500 పోలీసు ఉద్యోగాలు, మెగా డీఎస్సీ లను నెరవేరిస్తే నా సౌండ్ వెహికల్స్ స్వచ్చందంగా ఇచ్చేస్తా.
•    మహిళలకు ఇచ్చిన 45 ఏళ్లకే బీసీ,ఎస్సీ,ఎస్టీ మహిళలకు పెన్షన్, ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి, మద్యపాన నిషేధం లాంటి హామీలను నిలబెట్టుకుంటే నా మైక్ సరెండర్ చేస్తా.
•    పోలీసులకు జగన్ చాలా బాకీ పడ్డారు. పెండింగ్ లో ఉన్న 4 సరెండర్లు, 8 టీఏ, డీఏ బిల్లులు, మెడికల్ బిల్లులు ఇచ్చేస్తే నా స్టూల్ కూడా జగన్ రెడ్డి కి ఇచ్చేస్తాం.

•    జగన్ పాలనలో వైసీపీ నాయకులు దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తున్నారు. 
•    దళితులను చంపి జైలు నుండి విడుదలైన వారికి పాలాభిషేకాలు, గజమాలలతో సత్కరిస్తున్నారు.
•    సుబ్రమణ్యంని చంపేసిన అనంతబాబుకి సన్మానాలు చేశారు.
•    డాక్టర్ సుధాకర్, కిరణ్, ఓం ప్రతాప్ వంటి దళితులను జగన్ రెడ్డి పొట్టనబెట్టుకున్నారు. 
•    వరప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోముండనం చేశారు. 

•    జగన్ రెడ్డిది ఓ దరిద్రపు పాదం... ఆయన పాలనలో రాష్ట్రానికి అన్నీ అరిష్టాలే.
•    కచ్చులూరు బోట్ ప్రమాదం లో 51 మంది, ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 15 మంది, అన్నమయ్య డ్యామ్ ఘటనలో 62 మంది చనిపోయారు.
•    రాయలసీమకు పట్టిన శని జగన్.

•    కడప జిల్లాకు స్టీల్ ఫ్యాక్టరీ లేదు. అప్పర్ తుంగభద్రకు రూ.5,300 కోట్లను కేంద్రం కేటాయిచింది. అప్పర్ తుంగభద్ర పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారుతుంది.
•    అమర్ రాజా బ్యాటరీ కంపెనీని మన రాష్ట్రం నుండి జగన్ తరిమేశాడు... తెలంగాణ మంత్రి కేటీఆర్ అమర్ రాజా కంపెనీకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాడు.
•    ఈ కంపెనీ మన రాష్ట్రం నుండి పోవడం వల్ల 20వేల మంది మన యువకులు ఉద్యోగాలు కోల్పోయారు.

•    జగన్ రెడ్డి ముసలోడి మాదిరిగా కొబ్బరికాయ కొట్టడానికి కూడా వంగలేకపోతున్నాడు.
•    వెయ్యి మంది పోలీసులు అడ్డుకున్నా, 7 కిలోమీటర్లు వేగంగా నడిచి సభ పెట్టిన యువకుడు చంద్రబాబు.

•    కలియుగదైవం వెంకటేశ్వరస్వామి ఆలయంలోని బోర్డు మెంబర్ పోస్టులను జగన్ అమ్ముకున్నాడు. నేర చరిత్ర ఉన్న వారిని కూడా బోర్డులో వేసి జంబో బోర్డు ఏర్పాటు చేసారు.
•    టీటీడీ భూములను కూడా జగన్ అమ్మాలని ప్రయత్నం చేశారు.
•    జబర్దస్త్ ఆంటీ, నారాయణస్వామి, చిత్తూరుజిల్లా వైసీపీ నాయకులు వెంకటేశ్వరస్వామి ఆలయం దర్శనం టిక్కెట్లను అమ్ముకుంటున్నారు.
•    తిరుమల కొండపై గంజాయి దొరికింది అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం అవుతుంది. 

•    సొంతబాబాయ్ ని చంపినవాడు, పేదవాళ్లను వేధించేవాళ్లు అందరూ సైకోలే. ఈ సైకోలు జిల్లాకొక పిల్ల సైకోలను తయారుచేస్తున్నారు.
•    ఉమ్మడి చిత్తూరు జిల్లాకి పెద్దిరెడ్డి ఒక సైకో. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలు అన్నీ పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి.
•    చంద్రగిరిలో మూడు 'సీ' లు ఉన్నాయి. అవి 1.చంద్రగిరి 2. చెవిరెడ్డి. 3.చెవిలో పువ్వు.
•    చంద్రగిరిలో చెవిరెడ్డి కొండంత దోచుకుని ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నాడు.
•    చెవిరెడ్డి ఎమ్మెల్యే, తుడా చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్, ప్రభుత్వ విప్ అనే 4 పదవులు చేతిలో పెట్టుకుని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.

•    చెవిరెడ్డికి చీటీల ఎమ్మెల్యే అని పేరు ఉంది.
•    ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ చెవిరెడ్డి తమ్ముడు రఘు దోచుకుంటున్నాడు.
•    రూ.120 కోట్ల విలువగల 60 ఎకరాల భూమిని దోచుకున్నాడు. 
•    చెరువుల భూములను దోచుకుంటున్నాడు. స్వర్ణముఖి నదిలో నుండి రోజుకు 300 ట్రక్కుల ఇసుక టిప్పర్లతో దోచుకుంటున్నాడు.

•    చంద్రగిరి నియోజకవర్గంలో పసుపుజెండా ఎగిరి 30 ఏళ్లు అయ్యింది...
•    చరిత్ర తిరగరాయండి... నానిని భారీ మెజారిటీతో గెలిపించండి... చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ఎగురవేయండి.
•    చంద్రగిరిని అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటా.
•    టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రగిరిలో వరి, మామిడి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం.
•    గాలేరు-నగరి, హంద్రీనీవా పూర్తిచేస్తాం... సాగు, తాగు నీరు ఇస్తాం.
•    వరదల్లో కొట్టుకుపోయిన వంతెనలను కట్టిస్తాం.
•    నిత్యావసర ధరలు, ఇసుక ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం.

•    మహిళలు, కార్మికులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు అందరూ ఏకమై చంద్రబాబును సీఎం చేయండి.
•    నిరుద్యోగ యువతకు ప్రతి ఏడూ నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రైవేట్ రంగంలో కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం. స్వయం ఉపాధికి సహకారం           అందిస్తాం.
•    మీ సమస్యల్నింటినీ మేం పరిష్కరిస్తాం అని హామీ ఇస్తున్నాం.
•    మన బాధలు పోవాలంటే... బాబు రావాలి. సైకో పోవాలి....సైకిల్ రావాలి.

More Telugu News