సీబీఐ కేసులో బెయిల్, ఆ వెంటనే ఈడీ కస్టడీకి అప్పగింత... అభిషేక్ రావుకు వింత పరిస్థితి
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో సోమవారం అరెస్టయిన అభిషేక్ రావు
- సీబీఐ కేసులో అభిషేక్ రావుకు బెయిల్ ఇచ్చిన కోర్టు
- 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అభిషేక్ రావును అప్పగిస్తూ తీర్పు
- వినయ్ నాయర్ కు కూడా ఇదే తరహా పరిస్థితి
కోర్టు నిర్ణయంతో అభిషేక్ రావు ఊపిరి పీల్చుకునేలోగానే... ఆయనను తమ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తమ కస్టడీలో ఈ కేసు నిందితుడు శరత్ చంద్రారెడ్డి ఉన్నారని, ఆయనతో కలిపి అభిషేక్ రావును విచారించాల్సి ఉందని ఆ పిటిషన్ లో ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు.
ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు... అభిషేక్ రావును 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వెరసి సీబీఐ కేసులో బెయిల్ లభించినా.. అభిషేక్ రావు ఈడీ కస్టడీలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వినయ్ నాయర్ కు కూడా ఇదే తరహా పరిస్థితి ఎదురైంది.