Rana: 'విరాటపర్వం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథులు వీరే!

  • సాయిపల్లవి ప్రధాన పాత్రగా 'విరాట పర్వం'
  • రేపు శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ముఖ్య అతిథులుగా వెంకీ .. చరణ్ .. సుకుమార్ 
  • ఈ నెల 17వ తేదీన సినిమా రిలీజ్   
Virataparvam movie update

రానా - సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో 'విరాట పర్వం' సినిమా రూపొందింది. సురేశ్ బాబు - సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. 
 
ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ .. శిల్పకళావేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. వెంకటేశ్ .. చరణ్ .. సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుందంటూ అధికారిక పోస్టర్ ను వదిలారు. 

1990లలో గ్రామీణ నేపథ్యంలో సాగే నక్సలిజంతో ముడిపడిన కథ ఇది. జరీనా వాహెబ్ .. ఈశ్వరీరావు .. ప్రియమణి .. నివేదా పేతురాజ్ .. నందితా దాస్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాతో తనకి హ్యాట్రిక్ హిట్ పడుతుందనే నమ్మకంతో సాయిపల్లవి ఉంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.

More Telugu News