Petrol: అంబేద్కర్ జయంతి స్పెషల్... రూపాయికే లీటర్ పెట్రోల్... ఎక్కడంటే...!

  • అంబేద్కర్ జయంతి స్పెషల్
  • మహారాష్ట్రలోని షోలాపూర్ లో ప్రకటన
  • పోటెత్తిన వాహనదారులు
  • 500 మందికి ఆఫర్ వర్తింపజేసిన యాజమాన్యం
Ambedkar birth anniversary Special offer on petrol sales

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు, కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, మహారాష్ట్రలోని షోలాపూర్ లో ఓ పెట్రోల్ బంక్ యజమాని అంబేద్కర్ జయంతి సందర్భంగా నిజంగా బంపర్ ఆఫర్ ప్రకటించాడు. రూపాయికే లీటర్ పెట్రోల్ అంటూ ప్రకటన ఇచ్చారు. దాంతో వాహనదారులు ఆ పెట్రోల్ బంకు వద్దకు భారీగా తరలివచ్చారు. దాంతో వారందరినీ కట్టడి చేసేందుకు పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. 

అయితే, రూపాయికే లీటర్ పెట్రోల్ ఆఫర్ ను 500 మందికే అందించారు. దాంతో మిగిలినవాళ్లు నిరుత్సాహంతో వెనుదిరిగారు. దేశంలో పెట్రో ధరలు ఏ రీతిలో పెరుగుతున్నాయో తెలిసిందే. లీటర్ పెట్రోల్ రూ.120 వరకు ఉండడంతో వాహనదారులను సదరు ప్రకటన ఎంతగానో ఊరించింది.

More Telugu News