'వీరమల్లు' నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్న పవన్!
- చారిత్రక నేపథ్యంలో 'వీరమల్లు'
- 50 శాతం షూటింగు పూర్తి
- తదుపరి షెడ్యూల్ వచ్చేనెలలో
- కథానాయికగా నిధి అగర్వాల్
50 శాతం షూటింగు జరిగిన తరువాత కరోనా విరుచుపడింది. ఆ సమయంలో పవన్ కి కూడా కరోనా రావడంతో షూటింగు ఆపేశారు. అలా అప్పుడు ఆగిపోయిన షూటింగును తిరిగి ఇంతవరకూ మొదలుపెట్టలేదు. ఎందుకంటే ఈ లోగా 'భీమ్లా నాయక్' సినిమాను పూర్తిచేయాలని పవన్ అనుకోవడమే అందుకు కారణం.
ఇక ఇప్పుడు 'వీరమల్లు' తదుపరి షెడ్యూల్ కి పవన్ సిద్ధంగా ఉన్నాడు. వచ్చేనెలలో ఈ షెడ్యూల్ మొదలుకానుంది. ఇకపై నాన్ స్టాప్ గా షూటింగు జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. అందుకు అవసరమైన కొత్త లొకేషన్ల ఎంపిక ప్రక్రియను కూడా క్రిష్ పూర్తి చేశాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించనున్నారు.