Balakrishna: బెంగళూరుకు వెళుతున్న చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్

  • నిన్న గుండెపోటుతో మృతి చెందిన పునీత్ రాజ్ కుమార్
  • నివాళి అర్పించేందుకు వెళ్తున్న బాలయ్య, చిరంజీవి, తారక్
  • రాజ్ కుమార్ కుటుంబంతో నందమూరి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు
Balakrishna and Chiranjeevi and Junior NTR going to Bengaluru to pay tributes to Puneet Raj Kumar

ప్రముఖ కన్నడ సినీ నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిన్న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతికి గురయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ప్రధాని మోదీ కూడా తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. విధి చాలా క్రూరమైనదని అన్నారు.

మరోవైపు బాలకృష్ణ కాసేపటి క్రితం బెంగళూరుకు బయల్దేరారు. మధ్యాహ్నం చిరంజీవి, సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు వెళ్తున్నారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబంతో నందమూరి కుటుంబానికి తొలి నుంచి అనుబంధం ఉంది. దివంగత ఎన్టీఆర్ కు దివంగత రాజ్ కుమార్ తో ఆత్మీయ సంబంధాలు ఉన్నారు.

అలాగే, రాజ్ కుమార్ కుటుంబంతో చిరంజీవికి కూడా సాన్నిహిత్యం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కు పునీత్ రాజ్ కుమార్ వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. పునీత్ రాజ్ కుమార్ సినిమాలో తారక్ ఒక పాటను కూడా పాడి అలరించారు. ఈ నేపథ్యంలో వీరు బెంగళూరుకు వెళ్తున్నారు. పునీత్ మృతదేహానికి నివాళి అర్పించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

More Telugu News