Pavan kalyan: 'వీరమల్లు'పై దర్శకుడు క్రిష్ మాట ఇదే!

  • ముగింపు దశలో 'భీమ్లా నాయక్'
  • 25 శాతం పూర్తయిన 'వీరమల్లు'
  • నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేనెల 2వ వారం నుంచి
  • 50 శాతం పూర్తి చేయాలనే ఆలోచన  
Veeramallu movie update

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ 'హరి హర వీరమల్లు' సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే ఈ మధ్య పవన్ 'భీమ్లా నాయక్' షూటింగులోనే తప్ప, 'వీరమల్లు' సెట్స్ పై కనిపించలేదు. ఆ సినిమా ఎంతవరకూ వచ్చిందనేది ఎవరికీ తెలియదు. 'కొండ పొలం' సినిమా ప్రమోషన్లో, ఈ విషయంపై క్రిష్ క్లారిటీ ఇచ్చారు.

"మార్చి తరువాత 'వీరమల్లు' సినిమా షూటింగు జరగలేదు. అప్పటికి 25 శాతం చిత్రీకరణను పూర్తి చేశాము. ఈ సినిమా కోసం ప్లాన్ చేసిన సెట్ల నిర్మాణం పూర్తయింది. కానీ పవన్ బిజీగా ఉండటం వలన మళ్లీ షూటింగును మొదలుపెట్టలేదు. తదుపరి షెడ్యూల్ ను వచ్చేనెల 2వ వారంలో మొదలు పెట్టాలనుకుంటున్నాము.

ఆ తరువాత నుంచి మరో 25 శాతం చిత్రీకరణను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ఆ షెడ్యూల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ వరకూ షూటింగు చేసేస్తాము" అని చెప్పుకొచ్చారు. అంటే ఈ నెలాఖరుకు పవన్ 'భీమ్లా నాయక్'ను పూర్తి చేసి, ఆ తరువాత నుంచి 'వీరమల్లు' సెట్స్ పైకి వెళతాడన్న మాట.

More Telugu News