Allu Arjun: మళ్లీ షూటింగు మొదలెట్టేసిన 'పుష్ప'

  • కరోనా కారణంగా ఆగిన షూటింగు
  • తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోనే  
  • ఈ రోజునే మళ్లీ సెట్స్ పైకి
  • 45 రోజుల పాటు సాగనున్న షూటింగు
Pushpa shooting Re started

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో  'పుష్ప' సినిమా రూపొందుతోంది. చాలావరకూ ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. అయితే కరోనా కారణంగా కొన్ని రోజుల క్రితం షూటింగును ఆపేశారు. అప్పటి నుంచి కూడా అలా రోజులు గడుస్తూ వచ్చాయి. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గిన కారణంగా మళ్లీ షూటింగును మొదలుపెట్టాలనే ఉద్దేశంతో, కొన్ని రోజులుగా ఆ దిశగా సన్నాహాలు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున మళ్లీ సెట్స్ పైకి వెళ్లారు. హైదరాబాద్ లోనే అల్లు అర్జున్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు.

ఈ రోజు నుంచి 45 రోజుల వరకూ నాన్ స్టాప్ గా షూటింగు జరిగేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ షెడ్యూల్ తో 'పుష్ప' పార్టు 1కి సంబంధించిన షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు. అడవిలోకి చొరబడిన అవినీతి .. అక్కడ జరిగే దౌర్జన్యాలు .. ఎర్రచందనం అక్రమరవాణ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, అల్లు అర్జున్ చెల్లెలిగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి మాలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పరిచయమవుతున్నాడు.

More Telugu News