Kiara Advani: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • ఎన్టీఆర్ కు జంటగా కియారా ఖరారు 
  • యూకేలో మహేశ్ కొత్త సినిమా షూటింగ్
  • ఆరేళ్ల తర్వాత వస్తున్న వైవీఎస్ చౌదరి  
Kiara Advani signs for NTRs film

*  'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి విదితమే. ఇందులో కథానాయికగా పలువురి పేర్లు వినిపించినప్పటికీ, తాజాగా బాలీవుడ్ భామ కియారా అద్వానీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజక్టుకి ఆమె తాజాగా సంతకం చేసినట్టు సమాచారం.
*  మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మూడో సినిమా నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రం షూటింగులో ఎక్కువ భాగాన్ని యూకేలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మహేశ్ చేస్తున్న 'సర్కారువారి పాట' పూర్తికాగానే ఇది మొదలవుతుంది.
*  గతంలో పలు హిట్ సినిమాలు రూపొందించిన ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఆరేళ్ల విరామం తర్వాత ఇప్పుడు మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా దీనిని తెరకెక్కించడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నూతన హీరో హీరోయిన్లను పరిచయం చేసే అవకాశం వుంది.

More Telugu News