Mahesh Babu: 'సర్కారువారి పాట'కు అలా ప్లాన్ చేశారట!

  • మహేశ్ నుంచి నాన్ స్టాప్ ఎంటర్టైనర్
  • తొలిసారిగా ఆయన జోడీగా కీర్తి సురేశ్
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  
Sarkaruvari Paata second schedule starts from june

మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న 'సర్కారువారి పాట' సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వేలంపాటను ఏం చూస్తాం? అని ప్రేక్షకులు అనుకుంటారేమోనని, ఇది పూర్తిస్థాయి వినోదభరితమైన సినిమా అని పరశురామ్ క్లారిటీ ఇచ్చేశాడు. అప్పటి నుంచి ఈ సినిమా పట్ల అందరూ ఆసక్తిగానే ఉంటున్నారు. రెండో షెడ్యూల్ షూటింగు జరుగుతూ ఉండగా, కరోనా కారణంగా వాయిదా వేశారు. జూన్ నుంచి తిరిగి షూటింగ్ మొదలుపెట్టాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్పటికి కరోనా తగ్గుముఖం పడుతుందనే వాళ్లు భావిస్తున్నారట.

ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఆమె పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ, అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. దుబాయ్ సిటీలో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్స్ .. ఎడారి ప్రాంతంలో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. 'సంక్రాంతి'కి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు .. త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.

More Telugu News