Bhuma Akhila Priya: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ భర్త, అత్తమామలకు బెయిల్

  • సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు
  • తాజాగా ఆరుగురు నిందితులకు బెయిల్
  • భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలకు షరతులతో కూడిన బెయిల్
  • బెయిల్ పొందిన కిరణ్మయి, నాయుడు
Akhila Priya husband and in laws gets bail in kidnap case

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీమంత్రి అఖిలప్రియ నిందితురాలు అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరికొందరు నిందితులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

అఖిలప్రియ భర్త భార్గవరామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజా విచారణలో మొత్తం ఆరుగురు నిందితులు బెయిల్ పొందారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్గవరామ్ తల్లిదండ్రులు కిరణ్మయి, నాయుడులకు కూడా బెయిల్ లభించింది. ఇతర నిందితులు సిద్ధార్థ, మల్లికార్జునరెడ్డి కూడా బెయిల్ పొందారు.

ఇటీవల మాజీ మంత్రి అఖిలప్రియ ఓ భూవివాదంలో ప్రవీణ్ రావు, నవీన్, సునీల్ ను కిడ్నాప్ చేసినట్టు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేయగా, ఇదివరకే బెయిల్ పై ఆమె విడుదలయ్యారు.

More Telugu News