India: దేశంలో కొత్తగా 11,427 పాజిటివ్ కేసుల నమోదు

  • భారత్ లో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి
  • గత 24 గంటల్లో 118 మంది మృతి
  • 1,54,392కి పెరిగిన మృతుల సంఖ్య
  • 11,858 మందికి కరోనా నయం
  • యాక్టివ్ కేసుల సంఖ్య 1,68,235
India witnesses thousands of new cases

భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మునుపటి ఉద్ధృతి లేకపోయినా, కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,427 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 11,858 మంది కోలుకోగా, 118 మంది మరణించారు.

గత ఏడాది కాలంగా భారత్ లో కొవిడ్ మహమ్మారి ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,07,57,610 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,04,34,983 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 1,68,235 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,68,235కి చేరింది.

More Telugu News