Vijay Sai Reddy: జగన్ ఘనత చూసి పచ్చ మీడియా గొంతు ఇప్పుడు పెగలడం లేదు: విజయసాయి రెడ్డి

  • అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో మూడో స్థానంలో జగన్
  • ఏబీపీ, సీ-వోటర్ సర్వేలో వెల్లడి
  • ట్విట్టర్ లో ఎల్లో మీడియాపై విజయసాయి సెటైర్లు
Vijaya Sai Reddy Setires on Yellow Media

ఇండియాలోని అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ టాప్-3లో నిలిచినా, ఆ విషయాన్ని కొన్ని పత్రికలు ప్రచురించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "అప్పట్లో అడ్రసులేని సంస్థల నుంచి ఏవేవో అవార్డులొచ్చేవి బాబుకి. ఎల్లో మీడియా అహో... ఒహో అని ఎలివేషన్లు ఇచ్చేది. కొనుక్కున్న అవార్డులన్న సంగతి బయటికి రాకుండా ప్రచారం హోరు సాగేది. ఏబీపీ, సి-వోటర్ సర్వే జగన్ గారిని మూడో అత్యుత్తమ సిఎంగా గుర్తిస్తే పచ్చ మీడియా గొంతుపెగలడం లేదు" అని ఆయన సెటైర్లు వేశారు.

More Telugu News