రాజస్థాన్  లో విషాద ఘటన... 40 మంది భక్తులతో వెళుతున్న బోటు మునక.. పలువురి మృతి

Boat travels with devotees capsized in Chambal River
రాజస్థాన్ లో విషాద ఘటన జరిగింది. కోటా జిల్లాలోని చంబల్ నదిలో 40 మందితో ప్రయాణిస్తున్న బోటు నీట మునిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. ఈ బోటు ఇంద్రగఢ్ ప్రాంతంలో ఉన్న కమలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి భక్తులను తీసుకువెళుతోంది.

ఈ ఉదయం ప్రమాదం జరిగిందని కోటా జిల్లా రూరల్ ఎస్పీ శరద్ చౌదరి తెలిపారు. 20 నుంచి 25 మంది వరకు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారని వెల్లడించారు. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఈ బోటులోని వ్యక్తులు ఖటోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు. కాగా, ఈ బోటు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ను పునరుద్ధరించుకోకుండానే ప్రయాణాలు చేపడుతున్నట్టు తెలిసింది.
Go Back to Shorts
Boat
Kota
Chambal River
Rajasthan

More Telugu News