Shriya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • నితిన్ సినిమాలో కీలక పాత్రకు శ్రియ?
  • టాప్ బ్యానర్లో అఖిల్, సురేందర్ రెడ్డి సినిమా
  • తాప్సీ చిత్రంలో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్
Shriya approached for Nithin movie

*  హిందీలో వచ్చిన 'అందాధున్' చిత్రాన్ని నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. హిందీలో టబు పోషించిన కీలక పాత్ర కోసం శ్రియను అడుగుతున్నట్టు సమాచారం. దీనికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.
*  'సైరా' చిత్రం తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తారు. ఇదిలావుంచితే, అఖిల్ ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.
*  ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తున్న కథానాయిక తాప్సీ త్వరలో ఓ తమిళ చిత్రంలో నటించనుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా రూపొందే ఈ చిత్రానికి నూతన దర్శకుడు దీపక్ సౌందర్ రాజన్ దర్శకత్వం వహిస్తాడు. కాగా, ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ఇందులో గెస్ట్ రోల్ పోషిస్తాడట.  

More Telugu News