Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • 'రాధే శ్యామ్'లో పూజ హెగ్డే ద్విపాత్రాభినయం? 
  • వరుణ్ తేజ్ సినిమాలో మారిన కథానాయిక
  • అజిత్ సినిమా షూటింగులో కార్తికేయ
Pooja Hegde plays duel roles in Radhe Shyam

*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' చిత్రం తదుపరి షెడ్యూలు వచ్చే నెల నుంచి జరుగుతుంది. కాగా, ఇందులో కథానాయిక పూజ హెగ్డే ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. పునర్జన్మల కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు చెబుతున్నారు.
*  వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాక్సర్' చిత్రంలో హీరోయిన్ మారినట్టు తెలుస్తోంది. గతంలో సయీ మంజ్రేకర్ ను తీసుకున్నారు. తాజాగా ఆమె స్థానంలో నభా నటేష్ ను తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ చిత్రం తదుపరి షూటింగ్ వచ్చే నెల నుంచి కొనసాగుతుంది.
*  తమిళ స్టార్ అజిత్ హీరోగా నటిస్తున్న 'వాలిమై' చిత్రంలో టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఆ షెడ్యూలులో కార్తికేయ జాయిన్ అవుతాడట.  

More Telugu News