petrol: పది రోజుల్లో లీటరుకి రూ.5.47 పెరిగిన పెట్రోల్ ధర

Fuel prices hiked for 10th day in a row
  • పెట్రోలుపై నేడు లీటరుకు 47 పైసల పెంపు
  • డీజిల్‌పై లీటరుకు 93 పైసలు పెరుగుదల
  • పదిరోజుల్లో డీజిల్‌ ధర రూ.5.80 పెరుగుదల 
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదో రోజు కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 47 పైసలు, డీజిల్‌పై లీటరుకు 93 పైసలు పెరిగాయి. పది రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.5.47, డీజిల్‌ ధర రూ.5.80 పెరగడం గమనార్హం. ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.76.73కి, డీజిల్ ధర రూ.75.19కి చేరింది.

ముంబైలో పెట్రోలు లీటరుకి రూ.83.62కి, డీజిల్‌ 73.75కి చేరింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.80.37, డీజిల్ ధర రూ.73.17గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.78.55, డీజిల్ ధర రూ.70.84గా ఉంది.

petrol
diesel
India

More Telugu News