Mahesh Babu: నిర్మాతగా మహేశ్ బాబు .. హీరోగా విజయ్ దేవరకొండ?

  • హీరోగా వరుస విజయాలు
  •  నిర్మాతగా ఇతర హీరోలతో సినిమాలు
  • దూకుడు పెంచుతున్న మహేశ్ బాబు  
karthi Movie

మహేశ్ బాబు ఒక వైపున హీరోగా వరుస సినిమాలు చేస్తూనే .. మరో వైపున నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. తన సినిమాలకు మాత్రమే నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే మహేశ్ బాబు, ఈ మధ్యనే రూట్ మార్చాడు. ఓ మాదిరి బడ్జెట్ లో ఇతర హీరోల సినిమాలకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలా ప్రస్తుతం ఆయన అడివి శేష్ హీరోగా 'మేజర్' సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది.

ఇక ఆ తరువాత సినిమాను ఆయన విజయ్ దేవరకొండ హీరోగా నిర్మించనున్నట్టు తెలుస్తోంది.  ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును గురించిన వివరాలను వెల్లడి చేయనున్నారని చెబుతున్నారు. ఆ వెంటనే కార్తీ హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి మహేశ్ బాబు సన్నాహాలు చేయిస్తున్నాడని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని చెబుతున్నారు.  ఇటు హీరోగానే కాదు .. అటు నిర్మాతగా కూడా మహేశ్ బాబు తన దూకుడు పెంచుతున్నాడన్న మాట.

More Telugu News