Mahesh Babu: మహేశ్ కథలో మార్పులు.. కథానాయికగా కీర్తి సురేశ్

  • మహేశ్ తదుపరి సినిమాకి సన్నాహాలు
  • కథా నేపథ్యంపై పరశురామ్ కసరత్తు
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే ఆలోచన
Parashuram Movie

మహేశ్ బాబు తన తదుపరి సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పరశురామ్ ఈ కథను సిద్ధం చేశాడు. కథలో చాలా భాగం అమెరికాలో నడుస్తుంది. అయితే కరోనా కారణంగా కొంతకాలం వరకూ అమెరికాలో షూటింగులు చేసే పరిస్థితి లేదు.

అందువలన అమెరికాతో పాటు ఏ విదేశంతోను ముడిపెట్టకుండా కథలో మార్పులు చేయమని మహేశ్ బాబు చెప్పాడట. దాంతో ఇక్కడే షూటింగు జరుపుకునేలా పరశురామ్ కథలో మార్పులు చేస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు జోడీ కట్టే కథానాయిక అంటూ కొంతమంది పేర్లు వినిపించాయి. కానీ మహేశ్ బాబు సరసన ఇంతవరకూ చేయని కీర్తి సురేశ్ వైపే యూనిట్ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కన్నడ స్టార్ ఉపేంద్ర పేరు వినిపిస్తోంది.

More Telugu News