Prasad: దర్శకుడు సుకుమార్ మేనేజర్ ప్రసాద్ కన్నుమూత!

  • గుండెపోటుతో కన్నుమూసిన ప్రసాద్
  • ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు
  • కన్నీరు పెట్టుకున్న సుకుమార్
Producer Prasad Passes Away

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ స్నేహితుడు, ఆయనకు మేనేజర్‌ గా సేవలందిస్తున్న వీఈవీకేడీఎస్ ప్రసాద్‌ హఠాన్మరణం చెందారు. శనివారం ఆయనకు గుండెపోటు రాగా, కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయనకు భార్య పద్మజ, కుమార్తెలు సాయి ప్రణీత, సత్య ప్రజీత ఉన్నారు.

ప్రసాద్‌ నిర్మాతగా మారి 'అమరం అఖిలం ప్రేమ' అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. ప్రసాద్‌ మరణ వార్త విన్న సుకుమార్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తాను ఎప్పుడు కాస్తంత నిరుత్సాహంలో ఉన్నా ప్రసాద్‌ ధైర్యం చెప్పేవారని, ఆయనతో కాసేపు మాట్లాడగానే తనకెంతో ఎనర్జీ వచ్చేదని అన్నారు. ప్రసాద్ మృతి తనకెంతో లోటని, ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని సుకుమార్ కన్నీరు పెట్టుకున్నారు. ప్రసాద్‌ కుటుంబానికి టాలీవుడ్ ప్రముఖులు సానుభూతి తెలియజేశారు.

More Telugu News