Jagan: రాష్ట్రంలో కరోనా ప్రభావంపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం జగన్

  • కరోనాపై సీఎం జగన్ సమీక్ష
  • పాజిటివ్ కేసులు, తీసుకుంటున్న జాగ్రత్తలపై అధికారులకు సూచనలు
  • పాజిటివ్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టీకరణ
AP CM Jagan reviews on corona situations

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గురించి, తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్నీ పాల్గొన్నారు.

More Telugu News