Prabhas: ప్రభాస్ కోసం మార్కెట్ సెట్ .. రెండు రోజుల ఖర్చు రెండు కోట్లు!

  • ప్రభాస్ నుంచి భారీ రొమాంటిక్ చిత్రం 
  • 150 మంది పనివాళ్లతో భారీ సెట్ 
  • దసరాకి ప్రేక్షకుల ముందుకు
RadhaKrishna Movie

ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. తాజాగా ఈ సినిమా కోసం భారీ మార్కెట్ సెట్ వేశారు. ఇందుకోసం 2 కోట్లను ఖర్చు చేశారని అంటున్నారు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి నేతృత్వంలో 150 మంది పనివాళ్లు ఈ సెట్ ను పూర్తి చేస్తున్నారని అంటున్నారు.

1980 నేపథ్యంలో రూపొందే కథ కావడం వలన, ఆ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూనే ఈ సెట్ ను వేశారట. విలన్ గ్యాంగును తరుముతూ ప్రభాస్ ఈ మార్కెట్ లో పరిగెడతాడట. ఆ సీన్ ను రెండు రోజుల పాటు చిత్రీకరించనున్నారు. ఈ రెండు రోజుల షూటింగు కోసం 2 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుండటాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.

More Telugu News