Prabhas: ఆస్ట్రేలియా షూటింగును రద్దు చేసుకున్న ప్రభాస్ టీమ్?

  • ప్రభాస్ హీరోగా రొమాంటిక్ ఎంటర్టైనర్ 
  • తొలిసారి ప్రభాస్ జోడీ కడుతున్న పూజా హెగ్డే 
  • హైదరాబాద్ లోనే జరగనున్న షూటింగ్
Radha Krishna Movie

ప్రస్తుతం ప్రభాస్ .. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'జాన్'తో పాటు, 'ఓ డియర్' .. 'రాధే శ్యామ్'అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలా వరకూ జరిగింది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొంతకాలంగా షూటింగ్ చేస్తున్నారు. ఆ తరువాత షెడ్యూల్ ను ఆస్ట్రేలియాలో ప్లాన్ చేశారు.

అయితే 'కరోనా వైరస్' ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ సమయంలో అక్కడికి వెళ్లే ఆలోచనను ఈ సినిమా టీమ్ విరమించుకున్నట్టుగా చెబుతున్నారు. ఆస్ట్రేలియా షెడ్యూల్ కోసం మరింత కాలయాపన చేయకుండా, హైదరాబాద్ లోనే సెట్స్ వేసి, ఆ షెడ్యూల్ ను కూడా ఇక్కడే చిత్రీకరించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా చెబుతున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలెట్టారనే అంటున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News