Chandrababu: చంద్రబాబు వ్యాఖ్యల అంశాన్ని ఎథిక్స్ కమిటీకి ఇవ్వాలన్న ఆనం... స్పందించిన స్పీకర్

షార్ట్స్‌లో చూడండి
ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి 'ఉన్మాది' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు శాసనసభలో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేయగా... క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. మానవత్వం లేని వ్యక్తి క్షమాపణలు చెబుతారని తాను కూడా భావించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని చెప్పారు. సభ సంప్రదాయాల ప్రకారం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మనుషులన్నాక తప్పులు చేయడం సహజమేనని... ఈ విషయాన్ని చంద్రబాబు ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని లేదా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు. లేని పక్షంలో చంద్రబాబు వ్యాఖ్యల అంశాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు.

ఈ నేపథ్యంలో స్పీకర్ స్పందిస్తూ... క్షమాపణ చెప్పాలా? వద్దా? అనే విషయాన్ని చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. క్షమాపణ చెప్పకపోతే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తానని తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
Anam
Telugudesam
YSRCP

More Telugu News