Telugudesam: మాజీ ఎంపీ శివప్రసాద్‌ ను పరామర్శించిన చంద్రబాబునాయుడు

షార్ట్స్‌లో చూడండి
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత ఎన్.శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. శివప్రసాద్ కుటుంబసభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు తన ట్వీట్ లో తెలిపారు. శివప్రసాద్ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.
Go Back to Shorts
Telugudesam
N.Sivaprasad
Chandrababu
chitoor

More Telugu News