చచ్చీచెడీ 232 పరుగులు చేసిన శ్రీలంక!
- ఆదుకున్న మాథ్యూస్
- రాణించిన ఫెర్నాండో, మెండిస్
- చెరో మూడు వికెట్లు తీసిన ఆర్చర్, వుడ్
భీకర ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ కు ఈ లక్ష్యం ఏమాత్రం సరిపోదన్నది క్రికెట్ పండితుల విశ్లేషణ. సగం ఓవర్లలోనే మ్యాచ్ ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మ్యాచ్ విషయానికొస్తే, ఏంజెలా మాథ్యూస్ 85 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో రాణించడంతో లంక ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ధనంజయ డిసిల్వ (29) నుంచి మాథ్యూస్ కు మంచి సహకారం అందింది. అంతకుముందు, ఫెర్నాండో 49, మెండిస్ 46 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, వుడ్ చెరో 3 వికెట్లు తీయగా, అదిల్ రషీద్ 2 వికెట్లు సాధించాడు.