Telangana: విద్యా శాఖా మంత్రి మా జిల్లా వాడు కావడం మా దౌర్భాగ్యం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • తెలంగాణ ఉద్యమంలో మాదిరి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి
  • పరీక్షలు కూడా నిర్వహించలేని కేసీఆర్ ప్రధాని అవుతారట?
  • కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్ప వేరే శాఖలపై సమీక్షలు నిర్వహించరే?
తెలంగాణలో ఇంటర్ ఫలితాల గందరగోళంపై కాంగ్రెస్ నేతల విమర్శలు ఇంకా ఆగలేదు. తాజాగా, టీ-కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, విద్యా శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి తమ జిల్లా వాడు కావడం తమ దౌర్భాగ్యమని విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ ఉద్యమంలో మాదిరిగా కొనసాగుతున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా నిర్వహించలేని కేసీఆర్ ప్రధాని అవుతారట, కమీషన్ వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పా, ఇంకో శాఖపై ఆయన సమీక్ష నిర్వహించరని విమర్శించారు.
Telangana
kcr
intermediate
jagadish reddy
komati reddy
venkat reddy
t-congress

More Telugu News