పల్లెటూరి మొరటు మనిషిగా ధనుశ్

  • ధనుశ్ తాజా చిత్రంగా 'అసురన్'
  • చివరి షెడ్యూల్ షూటింగు మొదలు
  •  తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం
మొదటి నుంచి కూడా ధనుశ్ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఈ కారణంగానే ఆయన ఖాతాలో విజయవంతమైన చిత్రాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆయన తాజా చిత్రంగా 'అసురన్' రూపొందుతోంది. 'వడా చెన్నై' సినిమాతో ధనుశ్ కి భారీ సక్సెస్ ను ఇచ్చిన వెట్రిమారన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమాకి సంబంధించి బయటికి వచ్చిన ధనుశ్ పోస్టర్స్ అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. పెరిగిన గెడ్డం .. మీసాలు .. తలపాగా .. పంచకట్టు .. పాత చొక్కాతో పల్లెటూరి మొరటు మనిషిగా ధనుశ్ మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. జాతర నేపథ్యంలో ఎవరినో నరికినట్టుగా చేతిలో కత్తితో .. చొక్కాపై రక్తంతో ఆయన ఆవేశంతో వున్నాడు. చివరి షెడ్యూల్ మొదలైందంటూ ధనుశ్ పోస్ట్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తండ్రీ కొడుకులుగా ఆయన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. 
Go Back to Shorts
dhanush
manju

More Telugu News