నేడూ పెరిగిన పెట్రో ధరలు!
- పరుగాపని పెట్రో ధరలు
- పెట్రోలుపై 14 పైసలు, డీజిల్పై 29 పైసలు పెరుగుదల
- ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.87.29
ఈనెల 4న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పెట్రోలు, డీజిల్పై సుంకాన్ని లీటర్కు రూ.2.50 తగ్గించారు. ఆయన ప్రకటన తర్వాత మరికొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా సుంకాన్ని తగ్గించాయి. అయితే, సుంకాన్ని తగ్గించినప్పటికీ ధరల పెరుగుదల మాత్రం ఆగకపోవడం వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది.