నేడు ఏలూరులో పర్యటించనున్న పవన్ కల్యాణ్!

  • పశ్చిమగోదావరిలో మూడో విడత పర్యటన
  • ఉంగుటూరులో పోరాటయాత్ర సభ
  • మేధావులు, సంఘాలతో పవన్ భేటీ
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించనున్నారు. ఈ రోజు ఏలూరుకు చేరుకునే పవన్.. వివిధ వర్గాలు, సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యార్థులతో రేపు ఏలూరు మినీబైపాస్ రోడ్డులోని క్రాంతి కల్యాణ మండపంలో సమావేశమవుతారు. అనంతరం బుధవారం ఉంగుటూరు నియోజకవర్గంలో ‘పోరాట యాత్ర’ బహిరంగ సభను నిర్వహిస్తారు. అయితే ఎక్కడ ఈ సభ జరుగుతుందనేది ఇంకా ఖరారు కాలేదు.

పవన్ ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో రెండు విడతలుగా పర్యటించారు. మూడో విడతలో భాగంగా ఏలూరుకు నేడు చేరుకోనున్నారు. నిన్న నటుడు, కమెడియన్ అలీతో కలసి నెల్లూరు బారా షహీద్ దర్గాను పవన్ కల్యాణ్ దర్శించుకున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
pavan kalyan
eluru
West Godavari District
tour

More Telugu News