kcr: హరికృష్ణ నివాసంలో చంద్రబాబు, కేసీఆర్... ఫొటోలు చూడండి

  • హరికృష్ణకు నివాళి అర్పించిన కేసీఆర్
  • కుటుంబసభ్యులకు పరామర్శ
  • చంద్రబాబుతో మాట్లాడిన కేసీఆర్
రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లో ఆయన నివాస గృహంలో పార్థివదేహంపై పుష్పగుచ్చం సమర్పించి, సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తదితరులను కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కేసీఆర్ కాసేపు మాట్లాడారు.
kcr
Chandrababu
ntr
hari krishna

More Telugu News