మాజీ టీవీ యాంకర్ తేజస్విని సూసైడ్ నోట్ లభ్యం

  • ప్రేమించి, నమ్మినందుకు వేధించాడు
  • స్నేహితులే ఎక్కువయ్యారు
  • నన్ను పట్టించుకోవడం లేదు
మాజీ టీవీ యాంకర్ తేజస్విని 16వ తేదీ రాత్రి విజయవాడ సమీపంలోని కంకిపాడులో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆరోజు అత్తతో ఆమె గొడవ పడిందని... ఆ తర్వాత గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకుందని ఇంత వరకు తెలిసిన విషయం. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఆమె రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

"పవన్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నమ్మి వచ్చినందుకు నన్ను వేధించాడు. ఇబ్బందులు పెడుతున్నాడు. నాకన్నా స్నేహితులే అతనికి ఎక్కువయ్యారు. నన్ను పట్టించుకోవడం లేదు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నా" అంటూ సూసైడ్ నోట్ లో తేజస్విని పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.
Go Back to Shorts
anchor
tejaswini
suicide note

More Telugu News