ఎన్టీఆర్ గురించి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు: పురందేశ్వరి
- ఎన్టీఆర్ కు సంబంధించిన అన్ని విషయాలు తెలుగువారందరికీ తెలుసు
- ఆయన జయంతి తెలుగు జాతి పండుగలా జరపాలి
- పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ చరిత్రను చేర్చాలి
ఎన్టీఆర్ జయంతి అయిన మే 28వ తేదీని తెలుగుదేశం పార్టీ పండుగలా కాకుండా, తెలుగు జాతి పండుగలా జరపాలని ఈ సందర్భంగా పురందేశ్వరి కోరారు. ఎన్టీఆర్ పుట్టిన కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ జీవితచరిత్రను చేర్చాలని హరికృష్ణ కోరడంలో తప్పులేదని అన్నారు. మహానాడులో ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ, బాలకృష్ణలు ఉంటే బాగుండేదని చెప్పారు. అయితే, మహానాడు తొలిరోజైన నిన్న కొన్ని కారణాల వల్ల హాజరుకాలేని బాలయ్య... ఈ ఉదయమే సభాప్రాంగణానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.