Jagan: జగన్ సిఫారసుల మేరకే కన్నాకు బీజేపీ అధ్యక్ష పదవి దక్కింది!: బాబూ రాజేంద్రప్రసాద్

  • ఏపీలో బీజేపీ..భారతీయ జగన్ పార్టీగా మారింది
  • ఆ పార్టీకి జగన్ అద్డె మైకులా మారారు
  • కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి జగన్ నిధులు సమకూర్చారు
వైసీపీ అధినేత జగన్ సిఫారసుల మేరకే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కన్నా లక్ష్మీనారాయణకు దక్కిందని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో బీజేపీ..భారతీయ జగన్ పార్టీగా మారిందని అభివర్ణించారు. బీజేపీ, జగన్ లది అపవిత్ర కలయికని, ఆ పార్టీకి జగన్ అద్డె మైకులా మారారని విమర్శించారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి జగన్ నిధులు సమకూర్చారని ఆరోపించారు. 
Jagan
babu rajendra prasad

More Telugu News