ఐదేళ్లలో 'నోటా' మీటను ఎందరు నొక్కారో తెలుసా..?
- ఇప్పటివరకు నోటా మీట నొక్కిన ఓటర్లు 1.33 కోట్ల మంది
- దేశ ఎన్నికల్లో 2013 నుంచి నోటా ఆప్షన్ అందుబాటులోకి
- రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నోటా దక్కించుకున్న ఓట్లు 2.70 లక్షలు
2017లో గోవాలోని పనాజీ, వాల్పోయి నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వరుసగా 301 (1.94 శాతం), 458 (1.99శాతం) ఓట్లతో నోటా మూడో స్థానంలో నిలిచింది. కాగా, 2014లో తొలిసారిగా లోక్సభ ఎన్నికలకు నోటా ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. లోక్సభ ఎన్నికల్లో నోటాకి దక్కిన మొత్తం ఓట్లు 60,02,942. తమిళనాడులోని నీలగిరి లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 46,559 నోటా ఓట్లు వచ్చాయి. నోటా ఓట్లు అత్యల్పంగా లక్షద్వీప్ (123)లో నమోదయ్యాయి. ఇక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే, ఈ ఆప్షన్ను తొలుత ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేశారు. 2015లో అత్యధిక శాతం అంటే 2.08 శాతం (9,83,176 ఓట్లు) నోటా ఓట్లు పోల్ అయ్యాయి. బీహార్ (9,47,279), ఎన్సీటీ ఢిల్లీ (35,897) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు నోటాకి ఎక్కువగా మొగ్గు చూపారు.