మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక

మొహాలీలో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక ఎదురీదుతోంది. 393 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19 ఓవర్లలో 90 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. 16 పరుగులు చేసిన ఓపెనర్ గుణతిలక బుమ్రా బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ తరంగ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాండ్యా బౌలింగ్ లో కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వన్ డౌన్ లో వచ్చిన తిరిమన్నే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మ్యాథ్యూస్ (29), డిక్ వెల్లా (13) క్రీజులో ఉన్నారు.
Go Back to Shorts
second one day
mohali one day
sri lanka cricket
team india

More Telugu News