madhusudan: విశాల్ ను దినకరన్ దించాడు.. దినకరన్ ఆస్తులపై ఎన్నికల తరువాత దర్యాప్తు: మధుసూదనన్
సినీ నటుడు విశాల్ ను టీటీవీ దినకరనే బరిలోకి దించారని ఆర్కే నగర్ అన్నాడీఎంకే అభ్యర్థి, ఆ పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదనన్ ఆరోపించారు. కాశిమేడు ఫిషింగ్ హార్బర్ లో ప్రచారం చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాల్ కందువడ్డీ వ్యవహారంలో చిక్కుకున్నారని, దానిలోంచి కాపాడుతానని హామీ ఇచ్చి దినకరన్ ఆయనను ఎన్నికల బరిలో దించాడని మధుసూదనన్ ఆరోపించారు.
ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో విశాల్ ఖర్చు పెట్టనున్న డబ్బంతా దినకరన్ దేనని ఆయన తెలిపారు. 1991కి ముందు దినకరన్ కుటుంబం పరిస్థితి ఏంటని ఆయన అడిగారు. ఇప్పుడు ఆయన దగ్గరకు అంత డబ్బు ఎలా వచ్చింది? అని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల తరువాత దర్యాప్తు జరగనుందని ఆయన వెల్లడించారు.
ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో విశాల్ ఖర్చు పెట్టనున్న డబ్బంతా దినకరన్ దేనని ఆయన తెలిపారు. 1991కి ముందు దినకరన్ కుటుంబం పరిస్థితి ఏంటని ఆయన అడిగారు. ఇప్పుడు ఆయన దగ్గరకు అంత డబ్బు ఎలా వచ్చింది? అని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల తరువాత దర్యాప్తు జరగనుందని ఆయన వెల్లడించారు.