షహజాద్ భట్టి నెట్వర్క్పై ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటించిన కేంద్రం
- పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఎస్బీఎన్ ఉగ్రసంస్థగా గుర్తింపు
- యూఏపీఏ చట్టం కింద నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు
- ఆయుధాలు, మాదకద్రవ్యాల స్మగ్లింగే ప్రధాన కార్యకలాపం
- నటుడు మిథున్ చక్రవర్తికి బెదిరింపుల వెనుక ఈ సంస్థ హస్తం
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న షహజాద్ భట్టి నెట్వర్క్ను (ఎస్బీఎన్) కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) సెక్షన్ 35 కింద కేంద్ర హోంశాఖ బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో షహజాద్ భట్టి నెట్వర్క్ సంస్థతో పాటు దాని సభ్యులపై ఉగ్రవాద నిధులు (టెర్రర్ ఫైనాన్సింగ్), కుట్ర వంటి తీవ్రమైన అభియోగాల కింద కేసులు నమోదు చేసేందుకు దర్యాప్తు సంస్థలకు మార్గం సుగమమైంది.
ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, అందులో భాగంగానే ఈ కఠిన చర్యలు తీసుకున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ సంస్థ సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తూ, యువతను, చిన్నచిన్న నేరస్థులను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తోందని ఆయన పేర్కొన్నారు. విద్వేషపూరిత డిజిటల్ కంటెంట్తో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు, మత సామరస్యానికి ఈ సంస్థ విఘాతం కలిగిస్తోందని హోంశాఖ నోటిఫికేషన్లో వెల్లడించింది.
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న సిండికేట్గా అధికారులు ఎస్బీఎన్ను అభివర్ణిస్తున్నారు. గ్రెనేడ్లు, ఐఈడీ దాడులు, లక్షిత హత్యలు, పోలీసు, రక్షణ, మతపరమైన ప్రదేశాలపై నిఘా వంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఈ సంస్థకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని అధినేత షహజాద్ భట్టి దుబాయ్, పాకిస్థాన్ల నుంచి తన కార్యకలాపాలను నిర్వహిస్తుంటాడు. 2025 మార్చిలో పంజాబ్లోని జలంధర్లో యూట్యూబర్ రోజర్ సంధు నివాసంపై జరిగిన గ్రెనేడ్ దాడి, 2024 నవంబర్లో నటుడు మిథున్ చక్రవర్తికి అందిన బెదిరింపుల వెనుక భట్టి హస్తం ఉన్నట్లు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి.
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవానికి కొన్ని వారాల ముందు భద్రతా ఏజెన్సీలు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి ఎస్బీఎన్తో సంబంధం ఉన్న 253 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, తుపాకులు, పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు ఉన్న గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టులు, పలు కేసుల్లో వెల్లడైన ఆధారాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎస్బీఎన్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, అందులో భాగంగానే ఈ కఠిన చర్యలు తీసుకున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ సంస్థ సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తూ, యువతను, చిన్నచిన్న నేరస్థులను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తోందని ఆయన పేర్కొన్నారు. విద్వేషపూరిత డిజిటల్ కంటెంట్తో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు, మత సామరస్యానికి ఈ సంస్థ విఘాతం కలిగిస్తోందని హోంశాఖ నోటిఫికేషన్లో వెల్లడించింది.
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న సిండికేట్గా అధికారులు ఎస్బీఎన్ను అభివర్ణిస్తున్నారు. గ్రెనేడ్లు, ఐఈడీ దాడులు, లక్షిత హత్యలు, పోలీసు, రక్షణ, మతపరమైన ప్రదేశాలపై నిఘా వంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఈ సంస్థకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని అధినేత షహజాద్ భట్టి దుబాయ్, పాకిస్థాన్ల నుంచి తన కార్యకలాపాలను నిర్వహిస్తుంటాడు. 2025 మార్చిలో పంజాబ్లోని జలంధర్లో యూట్యూబర్ రోజర్ సంధు నివాసంపై జరిగిన గ్రెనేడ్ దాడి, 2024 నవంబర్లో నటుడు మిథున్ చక్రవర్తికి అందిన బెదిరింపుల వెనుక భట్టి హస్తం ఉన్నట్లు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి.
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవానికి కొన్ని వారాల ముందు భద్రతా ఏజెన్సీలు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి ఎస్బీఎన్తో సంబంధం ఉన్న 253 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, తుపాకులు, పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు ఉన్న గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టులు, పలు కేసుల్లో వెల్లడైన ఆధారాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎస్బీఎన్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.