బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయిందా? ఆర్బీఐ కొత్త రూల్స్తో కస్టమర్లకు ఊరట
- సైబర్ మోసాల కేసుల్లో ఖాతాల ఫ్రీజింగ్కు 60 రోజుల పరిమితి
- రూ.1000 దాటిన అనుమానిత లావాదేవీలపై తాత్కాలిక హోల్డ్
- వివరణ ఇచ్చేందుకు కస్టమర్లకు 20 రోజుల గడువు
- పోలీసుల నుంచి ఆదేశాలు లేకుంటే 31వ రోజు హోల్డ్ తొలగింపు
- 2027 ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనల అమలుకు ఆర్బీఐ సన్నాహాలు
సైబర్ నేరాల కారణంగా అమాయకుల బ్యాంకు ఖాతాలు నిరవధికంగా స్తంభించిపోతున్న సమస్యకు చెక్ పెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ముందుకు వచ్చింది. సైబర్ మోసాలు లేదా మనీ మ్యూల్ కార్యకలాపాలతో సంబంధం ఉందని అనుమానించే ఖాతాలపై తాత్కాలిక డెబిట్ హోల్డ్ (లావాదేవీల నిలిపివేత) విధించే ప్రక్రియలో స్పష్టమైన కాలపరిమితిని నిర్దేశిస్తూ కీలక ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం, ఎలాంటి ఖాతా ఫ్రీజింగ్ అయినా సాధారణ పరిస్థితుల్లో 60 రోజులకు మించకూడదు.
ఈ ఏడాది ఆగస్టు 4న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది. సైబర్ మోసాల కేసుల్లో ఖాతాల నిలిపివేతకు ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందించాలని, బాధితుల సమస్యలను వేగంగా పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆర్బీఐని ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఆర్బీఐ కేవైసీ సవరణ ఆదేశాలు 2026 పేరిట ఈ ముసాయిదాను సిద్ధం చేసింది.
కొత్త ప్రతిపాదనలు ఇవే..
ముసాయిదా ప్రకారం, బ్యాంకులు తమ లావాదేవీల పర్యవేక్షణ వ్యవస్థలు, కృత్రిమ మేధ (AI/ML) ఆధారిత సాధనాల ద్వారా మనీ మ్యూల్ లావాదేవీలను గుర్తించి, ఆయా ఖాతాలపై తాత్కాలికంగా డెబిట్ హోల్డ్ విధించవచ్చు. రూ.1,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలలో అనుమానాస్పద సూచికలు కనిపించినప్పుడు (ఉదా: కస్టమర్ ప్రొఫైల్కు భిన్నంగా అసాధారణ లావాదేవీలు, మోసపూరిత ఖాతాలతో సంబంధాలు) ఈ చర్య తీసుకుంటారు. అయితే, వెయ్యి రూపాయలు దాటిన ప్రతి లావాదేవీని ఫ్రీజ్ చేస్తారని దీని అర్థం కాదు. అవసరమైతే కేవలం ఒకే లావాదేవీని నిలిపివేయవచ్చని, ఖాతా మొత్తాన్ని ఫ్రీజ్ చేయడం చివరి ప్రయత్నంగానే ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
కస్టమర్లకు స్పష్టమైన ప్రక్రియ
ఖాతాను ఎందుకు హోల్డ్లో ఉంచారు, దానిని ఎలా తొలగించుకోవాలి, ఏ అధికారిని సంప్రదించాలి వంటి వివరాలను బ్యాంకులు తప్పనిసరిగా కస్టమర్కు తెలియజేయాలి. హోల్డ్ విధించిన తేదీ నుంచి 20 రోజుల్లోగా కస్టమర్ తన వివరణను సమర్పించవచ్చు. కస్టమర్ వివరణ ఇచ్చిన 10 రోజుల్లోగా బ్యాంకు నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ కస్టమర్ స్పందించకపోతే, హోల్డ్ విధించిన 30 రోజుల్లోగా బ్యాంకు తుది నిర్ణయం తీసుకుంటుంది. కస్టమర్ వివరణతో బ్యాంకు సంతృప్తి చెందకపోతే, ఆ కేసును నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP-CFCFRMS) ద్వారా సంబంధిత పోలీసులకు బదిలీ చేసి, ఆ విషయాన్ని కస్టమర్కు తెలియజేస్తుంది.
60 రోజుల గరిష్ట పరిమితి
ఈ తాత్కాలిక డెబిట్ హోల్డ్కు గరిష్టంగా 60 రోజుల పరిమితి ఉంటుంది. ఒకవేళ చట్ట అమలు సంస్థల నుంచి ప్రత్యేక ఆదేశాలు వస్తే తప్ప, ఈ గడువును పెంచడానికి వీల్లేదు. ఒకవేళ బ్యాంకు కేసును పోలీసులకు నివేదించిన తర్వాత 30 రోజుల్లోగా వారి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోతే, 31వ రోజున ఆ ఖాతాపై ఉన్న హోల్డ్ను బ్యాంకు తప్పనిసరిగా తొలగించాలి.
ఈ కొత్త నిబంధనలు వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRB), పట్టణ సహకార బ్యాంకులతో సహా అన్నింటికీ వర్తిస్తాయి. ఈ ముసాయిదాపై 2026 అక్టోబర్ 2 వరకు ప్రజాభిప్రాయాలను స్వీకరించి, 2027 ఏప్రిల్ 1 నుంచి వీటిని అమల్లోకి తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తోంది. ఈ నిబంధనల వల్ల మోసాలను అరికడుతూనే, నిజాయతీపరులైన కస్టమర్లు తమ సొమ్మును ఎక్కువ కాలం కోల్పోకుండా రక్షణ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 4న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది. సైబర్ మోసాల కేసుల్లో ఖాతాల నిలిపివేతకు ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందించాలని, బాధితుల సమస్యలను వేగంగా పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆర్బీఐని ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఆర్బీఐ కేవైసీ సవరణ ఆదేశాలు 2026 పేరిట ఈ ముసాయిదాను సిద్ధం చేసింది.
కొత్త ప్రతిపాదనలు ఇవే..
ముసాయిదా ప్రకారం, బ్యాంకులు తమ లావాదేవీల పర్యవేక్షణ వ్యవస్థలు, కృత్రిమ మేధ (AI/ML) ఆధారిత సాధనాల ద్వారా మనీ మ్యూల్ లావాదేవీలను గుర్తించి, ఆయా ఖాతాలపై తాత్కాలికంగా డెబిట్ హోల్డ్ విధించవచ్చు. రూ.1,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలలో అనుమానాస్పద సూచికలు కనిపించినప్పుడు (ఉదా: కస్టమర్ ప్రొఫైల్కు భిన్నంగా అసాధారణ లావాదేవీలు, మోసపూరిత ఖాతాలతో సంబంధాలు) ఈ చర్య తీసుకుంటారు. అయితే, వెయ్యి రూపాయలు దాటిన ప్రతి లావాదేవీని ఫ్రీజ్ చేస్తారని దీని అర్థం కాదు. అవసరమైతే కేవలం ఒకే లావాదేవీని నిలిపివేయవచ్చని, ఖాతా మొత్తాన్ని ఫ్రీజ్ చేయడం చివరి ప్రయత్నంగానే ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
కస్టమర్లకు స్పష్టమైన ప్రక్రియ
ఖాతాను ఎందుకు హోల్డ్లో ఉంచారు, దానిని ఎలా తొలగించుకోవాలి, ఏ అధికారిని సంప్రదించాలి వంటి వివరాలను బ్యాంకులు తప్పనిసరిగా కస్టమర్కు తెలియజేయాలి. హోల్డ్ విధించిన తేదీ నుంచి 20 రోజుల్లోగా కస్టమర్ తన వివరణను సమర్పించవచ్చు. కస్టమర్ వివరణ ఇచ్చిన 10 రోజుల్లోగా బ్యాంకు నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ కస్టమర్ స్పందించకపోతే, హోల్డ్ విధించిన 30 రోజుల్లోగా బ్యాంకు తుది నిర్ణయం తీసుకుంటుంది. కస్టమర్ వివరణతో బ్యాంకు సంతృప్తి చెందకపోతే, ఆ కేసును నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP-CFCFRMS) ద్వారా సంబంధిత పోలీసులకు బదిలీ చేసి, ఆ విషయాన్ని కస్టమర్కు తెలియజేస్తుంది.
60 రోజుల గరిష్ట పరిమితి
ఈ తాత్కాలిక డెబిట్ హోల్డ్కు గరిష్టంగా 60 రోజుల పరిమితి ఉంటుంది. ఒకవేళ చట్ట అమలు సంస్థల నుంచి ప్రత్యేక ఆదేశాలు వస్తే తప్ప, ఈ గడువును పెంచడానికి వీల్లేదు. ఒకవేళ బ్యాంకు కేసును పోలీసులకు నివేదించిన తర్వాత 30 రోజుల్లోగా వారి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోతే, 31వ రోజున ఆ ఖాతాపై ఉన్న హోల్డ్ను బ్యాంకు తప్పనిసరిగా తొలగించాలి.
ఈ కొత్త నిబంధనలు వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRB), పట్టణ సహకార బ్యాంకులతో సహా అన్నింటికీ వర్తిస్తాయి. ఈ ముసాయిదాపై 2026 అక్టోబర్ 2 వరకు ప్రజాభిప్రాయాలను స్వీకరించి, 2027 ఏప్రిల్ 1 నుంచి వీటిని అమల్లోకి తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తోంది. ఈ నిబంధనల వల్ల మోసాలను అరికడుతూనే, నిజాయతీపరులైన కస్టమర్లు తమ సొమ్మును ఎక్కువ కాలం కోల్పోకుండా రక్షణ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.