గోవాలో యూసీసీ అమలు చేయాలి.. అమిత్ షాకు అసదుద్దీన్ సవాల్

గోవాలో యూసీసీ అమలు చేయాలి.. అమిత్ షాకు అసదుద్దీన్ సవాల్

Asaduddin Owaisi challenges Amit Shah to implement UCC in Goa first
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎంఐఎం అధినేత ఓవైసీ సవాల్
  • విభిన్న సంస్కృతుల దేశంలో ఒకే చట్టం అసాధ్యమన్న ఓవైసీ
  • రాజకీయ లబ్ధి కోసమే యూసీసీ అంటున్నారని ఆరోపణ
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. 2029 నాటికి ఎన్డీయే పాలిత ప్రాంతాల్లో ఉమ్మడి పౌర స్మృతిని (యూసీసీ) అమలు చేస్తామని అమిత్ షా చేసిన ప్రకటనపై ఓవైసీ తీవ్రంగా స్పందించారు. "మీకు ధైర్యం ఉంటే, ముందుగా గోవాలో యూసీసీని అమలు చేయండి" అని ఆయన వ్యాఖ్యానించారు.

భారతదేశం వంటి విభిన్న సంస్కృతులు, విలక్షణ సంప్రదాయాలు కలిగిన దేశంలో అందరికీ ఒకే రకమైన చట్టాన్ని రుద్దడం సాధ్యం కాదని ఓవైసీ అభిప్రాయపడ్డారు. యూసీసీని తీసుకురావడం వల్ల రాజ్యాంగం గిరిజనులు, మైనారిటీలు, ఇతర సామాజిక వర్గాలకు కల్పించిన హక్కులకు, రక్షణకు భంగం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సున్నితమైన అంశాలను తెరపైకి తెస్తోందని ఓవైసీ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గోవాలో ఇప్పటికే కాథలిక్కులు, ఇతర వర్గాలకు వ్యక్తిగత చట్టాల్లో మినహాయింపులు ఉన్నాయని గుర్తు చేసిన ఆయన, ఆ మినహాయింపులను తొలగించకుండా దేశవ్యాప్తంగా యూసీసీని ఎలా అమలు చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
Advertisement
Asaduddin Owaisi
Amit Shah
Uniform Civil Code
UCC in Goa
AIMIM

More Telugu News