మధ్యప్రాచ్యంలో మంటలు.. 107 డాలర్లు దాటిన చమురు ధర
- 107.82 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్ ధర
- డబ్ల్యూటీఐ ధర 103.20 డాలర్లకు
- హర్మూజ్లో నౌకపై దాడితో ఉద్రిక్తత
- తాత్కాలికంగా నిలిచిన సౌదీ పైప్లైన్ కార్యకలాపాలు
- హర్మూజ్లో నౌకలపై ఇరాన్ ఆంక్షలు కఠినతరం
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 107 డాలర్లు దాటింది. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చన్న ఆందోళనలు ఇందుకు కారణమయ్యాయి.
నవంబరు డెలివరీ బ్రెంట్ క్రూడ్ ధర 3.20 శాతం పెరిగి 107.82 డాలర్లకు చేరింది. అమెరికా బెంచ్మార్క్ డబ్ల్యూటీఐ అక్టోబరు కాంట్రాక్ట్ కూడా 3.20 శాతం పెరిగి 103.20 డాలర్ల వద్దకు చేరింది. గత వారం మొదలైన ధరల పెరుగుదల సోమవారం కూడా కొనసాగింది.
హర్మూజ్ జలసంధి, గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై మార్కెట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం హర్మూజ్లో ఓ వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు.
డ్రోన్ దాడుల తర్వాత సౌదీ అరేబియా ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ను తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. మరోవైపు హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకలపై ఇరాన్ ఆంక్షలు కఠినతరం చేసింది. నౌకలు అనుమతి తీసుకుని వెళ్లాలని ఆదేశించింది.
ఇరాన్ నియంత్రణను సవాల్ చేస్తూ అమెరికా కూడా ఇరాన్ తీరంపై దాడులు చేసింది. ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య జరగాల్సిన చర్చలను ఒమన్ వాయిదా వేసింది.
ఆగస్టు ఆరంభంలో నమోదైన కనిష్ఠ ధరలతో పోలిస్తే బ్రెంట్ ఇప్పటికే 30 శాతానికి పైగా పెరిగింది. అమెరికా-ఇరాన్ మధ్య శాశ్వత ఒప్పందం కుదరకపోవడంతో ఆగస్టు చివర్లో మళ్లీ పోరు మొదలైంది. దీంతో చమురు సరఫరాలపై భయాలు మరింత పెరిగాయి.
సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి తగ్గడం కూడా మార్కెట్పై ప్రభావం చూపుతోంది. ఆగస్టులో రోజుకు 6.2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేసినట్లు ఒపెక్కు సౌదీ తెలిపింది. 2026లో ఇదే అత్యల్ప నెలవారీ ఉత్పత్తి. జులైతో పోలిస్తే ఉత్పత్తి 23 శాతం తగ్గింది.
నవంబరు డెలివరీ బ్రెంట్ క్రూడ్ ధర 3.20 శాతం పెరిగి 107.82 డాలర్లకు చేరింది. అమెరికా బెంచ్మార్క్ డబ్ల్యూటీఐ అక్టోబరు కాంట్రాక్ట్ కూడా 3.20 శాతం పెరిగి 103.20 డాలర్ల వద్దకు చేరింది. గత వారం మొదలైన ధరల పెరుగుదల సోమవారం కూడా కొనసాగింది.
హర్మూజ్ జలసంధి, గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై మార్కెట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం హర్మూజ్లో ఓ వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు.
డ్రోన్ దాడుల తర్వాత సౌదీ అరేబియా ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ను తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. మరోవైపు హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకలపై ఇరాన్ ఆంక్షలు కఠినతరం చేసింది. నౌకలు అనుమతి తీసుకుని వెళ్లాలని ఆదేశించింది.
ఇరాన్ నియంత్రణను సవాల్ చేస్తూ అమెరికా కూడా ఇరాన్ తీరంపై దాడులు చేసింది. ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య జరగాల్సిన చర్చలను ఒమన్ వాయిదా వేసింది.
ఆగస్టు ఆరంభంలో నమోదైన కనిష్ఠ ధరలతో పోలిస్తే బ్రెంట్ ఇప్పటికే 30 శాతానికి పైగా పెరిగింది. అమెరికా-ఇరాన్ మధ్య శాశ్వత ఒప్పందం కుదరకపోవడంతో ఆగస్టు చివర్లో మళ్లీ పోరు మొదలైంది. దీంతో చమురు సరఫరాలపై భయాలు మరింత పెరిగాయి.
సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి తగ్గడం కూడా మార్కెట్పై ప్రభావం చూపుతోంది. ఆగస్టులో రోజుకు 6.2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేసినట్లు ఒపెక్కు సౌదీ తెలిపింది. 2026లో ఇదే అత్యల్ప నెలవారీ ఉత్పత్తి. జులైతో పోలిస్తే ఉత్పత్తి 23 శాతం తగ్గింది.