ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. రెండు డీఏలు విడుదల
- సెప్టెంబరు జీతంతో పెంచిన డీఏ
- 2025 జనవరి నుంచి 1.82 శాతం డీఏ అమలు
- 2024 జులై నుంచి 2.73 శాతం డీఏ
- 2028లో 1.82 శాతం డీఏ బకాయిలు
- పింఛనుదారులకూ ఇదే షెడ్యూల్లో బకాయిలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది.
2025 జనవరి 1 నుంచి 1.82 శాతం డీఏ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన 20 నెలల బకాయిలను 2028లో నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. జనవరి, మార్చి, మే, జులై నెలల్లో బకాయిలు జమ చేయనున్నారు.
అలాగే 2024 జులై 1 నుంచి 2.73 శాతం డీఏ చెల్లించనున్నారు. దీనికి సంబంధించిన 26 నెలల బకాయిలను 2027లో నాలుగు విడతల్లో అందించనున్నారు. ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబరు నెలల్లో బకాయిలు చెల్లించనున్నారు.
పింఛనుదారులకు కూడా ఇదే విధానంలో డీఏ బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు, పింఛనుదారులకు సెప్టెంబరు జీతంతోనే పెరిగిన డీఏ ప్రయోజనం అందనుంది.
2025 జనవరి 1 నుంచి 1.82 శాతం డీఏ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన 20 నెలల బకాయిలను 2028లో నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. జనవరి, మార్చి, మే, జులై నెలల్లో బకాయిలు జమ చేయనున్నారు.
అలాగే 2024 జులై 1 నుంచి 2.73 శాతం డీఏ చెల్లించనున్నారు. దీనికి సంబంధించిన 26 నెలల బకాయిలను 2027లో నాలుగు విడతల్లో అందించనున్నారు. ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబరు నెలల్లో బకాయిలు చెల్లించనున్నారు.
పింఛనుదారులకు కూడా ఇదే విధానంలో డీఏ బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు, పింఛనుదారులకు సెప్టెంబరు జీతంతోనే పెరిగిన డీఏ ప్రయోజనం అందనుంది.